ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం రోజు సర్వసభ్య సమావేశం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఫోరం ప్రధాన కార్యదర్శి, నస్కంటి నాగభూషణం హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ, వయోవృద్ధుల సమస్యల కొరకు ప్రభుత్వ చట్టాలు పనిచేస్తున్నాయని, వాటిని తెలుసుకోవడానికి ప్రతి వృద్ధిని బాధ్యత అని తెలియజేశారు.వృద్ధుల సమస్యలను పరిష్కరించడానికి ఫోరం ప్రతినిధులు నిరంతరం అందుబాటులో ఉన్నారని. వారికి ఎలాంటి సమస్య ఎదురైనా 14567 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలుపాలని అన్నారు. ఫీల్డ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ, వయోవృద్ధులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు ఫోరం అధ్యక్షులు చిగుళ్లపల్లి నర్సింలు,విజయ్ కుమార్,ఫోరం ప్రజాప్రతినిధులు, సి.వెంకటేశ్వరప్ప, కే.శివ స్వామి,ఏ. వేణునాదం, పండరినాథ్,పి. చంద్రశేఖర్,సి. భీమయ్య,రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.