సంగారెడ్డి: శంకర్ ఆచూకీ తెలపండి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం జాడీ మల్కాపూర్ గ్రామానికి చెందిన బల్లెపు శంకర్ తేదీ 01. 04. 2025 నాడు ఇంటి నుండి తిరుపతి వెళ్తానని చెప్పి వెళ్లి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల వద్ద, తెలిసిన వారి వద్ద విచారించిన అతని జాడ తెలియలేదు. అతని భార్య బల్లెపు స్వప్న ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసామని ఎస్ఐ ప్రసాద్ రావు గురువారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. కావున వివరాలు తెలిసిన వారు ఎస్ఐ నెంబర్ కు 8712656764, 8712661847. తెలియజేయాలని కోరారు.