Planned Development for Villages
ప్రణాళికబద్దంగా గ్రామాల అభివృద్ధి
* ఎమ్మెల్యే కాలే యాదయ్య
* శంకర్పల్లి మండలంలో 1కోటి అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు
చేవెళ్ల, నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. గురువారం చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో 1.కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని ప్రణాళికాయుతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. లక్ష్మారెడ్డిగూడ 25లక్షలు, గాజులగూడ 35లక్షలు, ,అంతప్పగూడ 25లక్షలు ,కొత్తపల్లి 25లక్షలు, గ్రామాలలో కోటి రూపాయల విలువైన ( సీసీ రోడ్డు & స్ట్రీట్ లైట్స్)వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేశారు. ఈ కార్యక్రమాలలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
