
బేడ బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వద్దని తసిల్దార్ కి వినతి పత్రం.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల తాసిల్దార్ కి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్న బాలసంత కాటిపాపల కులస్తులకు బేడ బుడగ జంగామాని తప్పుగా చెప్పి ఎస్సి కులం సర్టిఫికెట్ తీసుకుంటున్న వాటిని రద్దు చేయాలని సంబంధించిన జిల్లా మండల అధికారులకు తెలియజేయుచున్నాము .
బాలసంత కాటిపాపల కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వద్దాన్ని చల్లగరిగే ముసినిపర్తి,చిట్యాల గ్రామాల నుండి దళితులు వచ్చి తాసిల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఇతర కులాలకు చెందిన వారు మేమే బెడ బుడగ జంగం అని మాకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వమని ఎవరైన అప్లికేషన్ పెట్టిన కూడా వారు గతంలో ఏ పాఠశాలలో చదువుకున్నటువంటి అడ్మిషన్ రిజిస్టర్ను ఎంక్వయిరీ చేసి వారికి ఇవ్వగలనీ ఎందుకంటే వాళ్లు ఏదో సర్టిఫికెట్ పట్టుకొచ్చి మేము తీసుకొని దళితులకు అసలైన ఎస్సీ కులానికి చెందిన వాళ్లకు అన్యాయం జరుగుతున్నది ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు లబ్ది పొందడం కోసం మరియు రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం వాళ్ళు పోటీ చేయడం కోసము తయారవుతున్నందున వారికి జిల్లా కలెక్టర్ తో విచారణ జరిపించి ఇవ్వగలరు .
బాలసంత కాటిపాపల కులాలకు చెందినవారు బేడ బుడగజంగా వాని తాప్కా చెప్పుకుంటూ ఉన్నందున వారు గతంలో చదువుకున్నటువంటి పాఠశాలలో అడ్విజన్ రిజిస్టర్ లను తీసుకువచ్చి చిట్యాల తాసిల్దార్ కి చూపెట్టడం జరిగింది మేము మీ అన్నయ్య సాక్ష్యాలు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నాం గతంలో ఎలాంటి విచారణ లేకుండా తప్పుగా సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చెయ్యాలి లేనిచో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని దళిత సంఘాలైన మేము హెచ్చరిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య (ఎమ్మార్పీఎస్) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు జేరిపోతుల ఓదెలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దూడపాక సాంబయ్య డిఎస్పి నాయకులు పుల్ల అశోకు చల్లగరియా ముచి నీపర్తి గ్రామాల చెందిన దళిత సంఘాల నాయకులు సోమిడిరఘుపతి దూడపాక దివాకరు నోముల శివశంకరు సిరి పెళ్లి నరేష్ కొల్లూరి అశోకు దూడపక రాజు తదితరులు పాల్గొన్నారు.