తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై తాసిల్దార్ కు వినతి పత్రం

బిజెపి నాయకులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బిజెపి నాయకులు తాసిల్దార్ కు వినతి పత్రము అందజేస్తూ నీళ్ళు నిధులు నియామకాలు అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు నియామకాల విషయంలో నిరుద్యోగులు మోసానికి గురవుతున్నారనేది జగమెరిగిన సత్యం గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపించినట్లుగానే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో నడుస్తూ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుంది ఈ మోసాలను ఎండగడుతూ తెలంగాణ యువత నిరుద్యోగుల తరపున బీజేవైఎం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉంది అయినప్పటికీ ఈ నియంతృత్వ ప్రభుత్వం కనీస స్పందన లేకుండా కాలం గడిపేస్తుంది నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది కావున మీరైనా ఈ నిరుద్యోగ సమస్యలను జిల్లా కలెక్టర్ గారి వద్దకు తీసుకెళ్ళమని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేస్తున్నాం బీజేవైఎం రాష్ట్ర శాఖ నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రధాన అంశాలు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలి గ్రూప్ – 2, గ్రూప్ – 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలి 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలి ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను పోస్ట్ పోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలి అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలి పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలి జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలిఈ కార్యక్రమంలో బీజేవైఎం కళాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ బీజేవైఎం మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ బీజేపీ మండల నాయకులు మొగిలిచర్ల ప్రభాకర్ చిత్తారి కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *