ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా.
#పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ (కోటి).
నల్లబెల్లి, నేటి ధాత్రి:
నల్లబెల్లి మండల కేంద్రంలో బిజెపి బలపరిచిన 11వ వార్డు అభ్యర్థిగా పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ (కోటి) బరిలో నిలిచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11వ వార్డు సభ్యునిగా నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచానని. వార్డులో ఉన్న ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని. సమస్యలపై గళం వినిపించేందుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డులో ఉన్న సమస్యలపై పోరాడి పరిష్కారం చేస్తానని. అలాగే ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని హామీ ఇచ్చారు.
