నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు
నెన్నల్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన బత్తిని మల్లాగౌడ్, అంకమ్మ పెద్ద కుమారుడైన బత్తిని సతీష్ గౌడ్ వయస్సు42,ఆరోగ్యం బాగా లేకపోవడంతో శుక్రవారం రోజున అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ హాస్పటల్లో చేర్పించగా త్రీవ అస్వస్థతకు గురి కావడంతో అక్కడి నుంచి శనివారం రోజున ఉదయం హైదరాబాద్ తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యలోనే హఠాత్తుగా మరణించాడు. ఇతనికి భార్య సుజాత వయస్సు 38,ఇద్దరు కూతుర్లు ఉన్నారు.పెద్ద కూతురు అశ్విత వయస్సు 12, చిన్న కూతురు మధురిమ వయస్సు 10 వీరి కుటుంబంలో చీకటి నింపి వెళ్లి, మరో కుటుంబంలో వెలుగు నింపాలని అతని యొక్క నేత్రాలను వారి కుటుంబ సభ్యులు ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో అతని యొక్క నేత్రాలను దానం చేయడం జరిగింది. అంత బాధలో కూడా మరొక వ్యక్తికి చూపు కల్పించాలని వారి యొక్క ఆలోచన విధానం అందరిని కంటతడి పెట్టించింది.