ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి :
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు