అభివృద్ధి చేయగల సమర్థత,సత్తా ఉన్న బలరాం నాయక్ లాంటి నాయకుడు గెలిచి పార్లమెంట్ కి వెళితేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది.
భద్రాచలం నేటి ధాత్రి
మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి
మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి సారధ్యంలో భద్రాచల పట్టణంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.
ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ, గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భద్రాచల నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో సిసి రోడ్లు, సైడ్ డ్రాయింగ్స్, కరెంటు స్తంభాలు వేయించి అభివృద్ధికి పునాదులు వేశారని, పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలనలో ఏ రోజు కూడా ఒక అభివృద్ధి పని చేయడం అనేది మేము ఎరగమని ప్రజలు నాయకులతో వాపోయారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ
నిజంగా భద్రాచల నియోజకవర్గంలో అభివృద్ధికి పునాదులు వేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ హయాంలోనైనని.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ, ఏ రోజు కూడా భద్రాచల అభివృద్ధి గురించి ఈ ప్రాంత సమస్యల గురించి ఆలోచన చేయలేదని, కనీసం రాముల వారి కళ్యాణానికి భద్రాచలం వచ్చే తీరిక అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేకుండా పోయిందని, అలాంటి అహంకార పూరిత పాలనే ఈరోజు కేసీఆర్ పతనానికి కారణమైందని ఆయన అన్నారు.
ఇక్కడి ప్రజలతో సత్సంబంధాలు కలిగి నియోజకవర్గనీ అభివృద్ధి చేయగల సత్తా ఉన్న పోరిక బలరాం నాయక్ నిమే 13వ తేదీన జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంట్కు పంపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల ప్రచారంలో
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసముల రాము, అన్నేం రామిరెడ్డి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి, మహిళా కాంగ్రెస్ నాయకుల తుమ్మల రాణి, కట్ట కళ్యాణి ,రూప దేవి, పద్మప్రియ ఎస్సీ సెల్,ఎస్టీ సెల్,మహిళా కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నరు.