Use Govt Schemes: Councillor
ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
26వ డివిజన్ కౌన్సిలర్ మండల శ్రీదేవి శ్రీనివాస్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని 26వ డివిజన్లో ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు నిర్వహించిన వార్డు సభలో 26వ డివిజన్ కౌన్సిలర్ మండల శ్రీదేవి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం విడతలవారీగా కొనసాగుతాయని చెప్పారు. ఆసరా పెన్షన్లు, ఇందిరమ్మ గృహాలు మరియు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. భాస్కర్, వార్డ్ ఆఫీసర్ ఎ. స్వామి, ఆనంద్, ఆర్.పీ. అనురాధ, వార్డు ముఖ్యులు నాడెం సాంబయ్య, గుండెబోయిన శివ, కోటి, దోనాల రవి, బండి వేణు, అడుప రాంబాబు, నీరటి రంజిత్, నాడెం రామకృష్ణ, మార్త శంకర్, మార్త సాంబయ్య, మనగాని సాంబయ్య, కాంతల జనార్దన్ రెడ్డి, నాసం వీరస్వామి, దోమ నిర్మల, మనగాని స్వప్న, కవిత మాధురి తదితర లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
