# మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి
# మహనీయుల చరిత్రను వారు చేసిన త్యాగాలను మనమంతా తెలుసుకోవాలి
# జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి శ్రీజ
ములుగు జిల్లా నేతిధాత్రి
ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనo సమావేశ మందిరం లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి. శ్రీజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహనీయుల జీవితం నుంచి మనం వారి పనితీరు వారు దేశం కోసం చేసిన త్యాగాలు తెలుసు కోవడానికి ఇట్టి కార్యక్రమాలు దోహదపడతా యని అన్నారు మనదేశం దృఢంగా ఉంటూ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ అన్ని మతాల, వర్గాల వారు ఇక్కడ ప్రశాంతంగా నివసించే వాతావరణం ఏర్పడడానికి మనం రచించుకున్న రాజ్యాంగం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు అని తెలిపారు బాబు జగ్జీవన్ రామ్ దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారని కీలక సమయంలో సరిహద్దులను కాపాడి దేశాన్ని ఒక్కటి చేసిన మహనీయుడని, రాజకీయాల్లో సుదీర్ఘ కాలం రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తి అని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో, రాజకీయ రంగంలో, సామాజిక వేత్తగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు బాలికల విద్యకు సైతం ఆయన ప్రాధాన్యత కల్పించారని, తన కుమార్తెను ఇండియన్ ఫారిన్ సర్వీస్ వంటి ఉన్నత చదువులు చదివించారని, మహిళలు చదివితే కుటుంబంతో పాటు సమాజాభివృద్ధికి అవకాశం ముంటుందని తెలియజేసిన మహనీయుడు అని తెలిపారు ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి తుల రవి, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.