భూపాలపల్లి నేటిధాత్రి
ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసు గ్రీవెన్సెల్ లో భూపాలపల్లి జిల్లా వివిధ మండలాల్లో పంచాయితీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.గ్రామాలలో సర్పంచి పదవీకాలం ముగియడంతో గ్రామ లలో అవసరమైన పారిశుధ్యం,లైటింగ్ ,త్రాగునీటి సమస్యల పై పంచాయితీ కార్యదర్శులు డబ్బులు ఖర్చు చేస్తున్నారు.గ్రామ పంచాయితీ ల నిధులు ప్రభుత్వం నుండి సకాలంలో విడుదల కాక పంచాయితీ కార్యదర్శులు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి గ్రామాలలో పనులు చేస్తున్నారు,చేసిన పనులకి స్పెషల్ ఆఫీసర్లు బిల్లుల పై సంతకాలు పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు.దీని పై కలెక్టర్ వెంటనే స్పందించి గ్రామ పంచాయితీల కు నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో ధర్మ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ కార్యక్రమం లో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్,జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల శ్రీనివాస్,జిల్లా ప్రధాకార్యదర్శి కండె రవి,భూపాలపల్లి మండల కన్వీనర్ గుండ్ల ఓంకార్,మండల నాయకులు బండారి దశరథ్,మోకిడి అశోక్ పాల్గొన్నారు.