
TPCC Leader Pendem Ramanand Pays Tribute in Narsampet
మృతురాలి కుటుంబాన్ని పెండెం రామానంద్ పరామర్శ
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణం 23 వ వార్డుకు చెందిన వరంగంటి బుచ్చమ్మ మరణించగా ఆమె మృతదేహంపై టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవండ్ల రాంబాబు, 23వ వార్డు అధ్యక్షుడు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు అధ్యక్షుడు కోల చరణ్ గౌడ్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేల్లి సారంగం గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొలువుల వెంకటేశ్వర్లు, దూడేల సాంబయ్య, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేడబోయిన కుమార్, గద్ద వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.