
Government Policies.
రైతాంగ పోరాటం సామాజిక ఉద్యమాలు
ప్రస్తుత ప్రభుత్వ విధానా లపై వైఖరి
పంటకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అఖిల భారత రైతు సమైక్య వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శత జయంతి ఉత్సవాల భాగంగా రైతుల యొక్క బాధలు వారి అభిప్రాయాలు సేకరణ అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై వైఖరి మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. పంటల అవసరమైన ఎరువు లు సరఫరా పైన, రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఉద్యమం చేపట్టాలి.

ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు సమైక్య సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగా ర్జున, రాష్ట్ర కమిటీ సభ్యు రాలు మాస్ సావిత్రి, హంస రెడ్డి, ఉపేందర్ రెడ్డి, కర్ర రాజి రెడ్డి ,వక్కల కిషన్, ఉస్మాన్ మహమ్మద్ ,సంఘ సభ్యులు పాల్గొన్నారు