కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ……………
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి …………………..
టెర్రరిస్టుల దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం ఆర్యవైశ్య అధ్యక్షులు బెజగం నాగరాజు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సభ్యులు అందరూ కలిసి పహల్గం లో జరిగిన టెర్రరిస్ట్ దాడి వలన చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ చనిపోయిన వారికి ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకొనుచు మండల కేంద్రంలో క్రోవత్తులతో శాంతిరాలి నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండల ఆర్యవైశ్య అధ్యక్షులు బెజగం నాగరాజు ఉపాధ్యక్షులు బజ్జూరు వీరన్న యూత్ కమిటీ మెంబర్స్ పుల్లూరు సాయి మరియు బజ్జురి శ్రీరాములు మరియు మండల మాజీ అధ్యక్షులు బజ్జురి శ్రీనివాస్ ఇతర ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగినది