
Peace Committee Prepares for Ganesh Chaturthi & Milad
వినాయక చవితి, మిలాద్ ఉత్సవాల కోసం శాంతి కమిటీ సమావేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని హద్మూర్ స్టేషన్ లో నేడు శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ సుజీత్ తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు, మిలాద్ ఉత్సవాల నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరుకావాలని శనివారం ఆయన కోరారు. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి, సెప్టెంబర్ 5న జరిగే మిలాద్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా వినాయక చవితి మిలాద్ ఉన్ నబీ పండుగలను జరుపుకోవాలని అన్నారు,