
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ కై రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించిన పి డి ఎస్ యు రాష్ట్ర కార్యవర్గం
ప్రభుత్వము స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రను మానుకోవాలి
అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను తక్షణమే విడుదల చేయాలి
ఈరోజు పిడిఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి అన్ని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు పి డి ఎస్ యు నాయకులు ముట్టడించడం జరిగింది.
ఈ సందర్భంగా పి డి ఎస్ యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీలలో డొనేషన్ పేరిట ప్రైవేట్ కళాశాలలు పేద విద్యార్థుల నుండి ఎక్కువ మొత్తము ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు రక్తం తాగుతున్నారని తక్షణమే డొనేషన్ పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టాలని వర్షపుతాను డిమాండ్ చేశారు.అంతేగాక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈరోజు పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయడం లేదని పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం ఈ ప్రభుత్వాలకు తగదని పేద విద్యార్థులు పైతరగతిలకు వెళ్లడానికి కాలేజీలకి సర్టిఫికెట్ కోసం వెళితే ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజు కట్టమని పీడిస్తున్నారు ఇందువలన ఫీజు కట్టలేని పేద విద్యార్థులు తక్కువ స్థాయి చదువులకే పరిమితమై విద్యకు దూరమైతున్నారు .
రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పూనుకుంటున్నదని తన వైఖరిని మార్చుకొని తక్షణమే పెండింగ్ లో ఉన్న 7200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రివర్స్మెంట్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది .లేనియెడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పి డి ఎస్ యూ అలుపెరగని ఉద్యమాలకు పండుకుంటుందని ఏ విద్యార్థులైతే బి ఆర్ ఎస్ ను గద్దదింపారు ఆ విద్యార్థులే మీ పతనానికి పూనుకుంటారని హెచ్చరిస్తున్నాం అన్నారు.