పట్టుకున్న ఎస్సై వంశీకృష్ణ
వీణవంక ,(కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండలంలోని గ్రామాల్లో విలేజ్ పెట్రోలింగ్ చేయుచుండగా ఉదయం సుమారు 6 గంటల సమయంలో చల్లూర్ అంబెడ్కర్ కూడలి వద్ద ఎదురుగా ఒక టాటా ఏసీ ట్రాలీ దానిని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 40 క్వింటాలు పిడిఎస్ బియ్యం ఉన్నాయి. దాని డ్రైవర్ అయిన కాసరపు శ్రీనివాస్ తండ్రి గట్టయ్య, వయస్సు 44 హరిపురం గ్రామము, ఓదేల మండలం అనునతన్ని ఇట్టి బియ్యం ఎక్కడివి, ఎక్కడి నుండి తీసుకొనిపోతున్నావాని, దీనికి సంబంధించిన అనుమతి పత్రాలు ఉన్నాయా అని అడిగా గా నేను ఊబిది నరేష్ తండ్రి శంకర్, వయసు 43 బుడగ జంగము, వీణవంక గారి వద్ద ట్రాలీ డ్రైవర్ గా పని చేస్తాను అని ఇద్దరము కలిసి వీణవంక, శంకరపట్నం మండలం లో గల గ్రామలల్లోని ప్రజల వద్ద ఎలాంటి అనుమతి గాని లైసెన్సు గాని లేకుండా అక్రమంగా కిలో ఒక్కటికి 12, 13 రూపాయలు చొప్పున కొనుక్కొని పోయి17 రూపాయల చొప్పున సిద్దిపేట శివారులో గల పౌల్ట్రీ/కోళ్ల ఫారాలలో కోళ్ల దాన కు అమ్ముకుంటు జీవన ఉపాధి కొనసాగిస్తున్నాము అని అన్నారు. పంచనామా చేసి పిడిఎస్ బియ్యంతో పాటు, ట్రాలీ దాని డ్రైవర్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపినారు. ఎస్సై మాట్లాడుతూ…ఇలాంటి చట్టానికి వ్యతిరేకంగా తప్పుడు పనులు చేసిన పిడిఎస్ బియ్యం కొనడానికి వచ్చిన అమ్మినవారు ప్రోత్సహించిన వారిపై అవసరమైతే పిడి యాక్ట్ కేసు కూడా నమోదు చేయవలసి ఉంటది పోలీస్ సమాచారం తెలిసిన వెంటనే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం కాబట్టి గ్రామాలలో జాగ్రత్తగా ఉండాలి.