నేటి ధాత్రి యాదాద్రి చౌటుప్పల్ :
మండల కేంద్రంలో పలు విత్తన డీలర్ షాపులను స్క్వాడ్ బృందాల హెడ్ బి వెంకటేశ్వరరావు ఏ డి ఏ ఆలేరు, వ్యవసాయ అధికారి అరుణకుమారి మరియు స్వప్న లతో కలిసి అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి మరియు పోలీసు బృందాలతో తనిఖీ చేశారు .పలు విత్తన షాపుల్లో వారికి సంబంధించిన కొన్ని కంపెనీల లేబుల్ పరిశీలించారు వాటికి సంబంధించిన తేదీలు గడువు కాలము పూర్తిగా లేని వాటికి సంబంధించిన క్రయ విక్రయాలు నిలుపుదల చేస్తూ వారికి నోటీసులు ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విత్తనాలు కొన్న తరువాత రసీదును కాలి ప్యాకెట్ను దానికి సంబంధించిన లేబుల్ జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు గ్రామాలలో ఎవరైనా విడిగా పత్తి విత్తనాలు అమ్మితే వారి పైన కఠి చర్యలు తీసుకుంటామన్నారు కల్తీ విత్తనాలు అమ్మినట్లయితే పిడి యాక్ట్ పెడతామని తెలియజేశారు