పహాల్గం మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన జూనియర్ సివిల్ జడ్జి శాలిని లింగం
ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పరకాల న్యాయవాదులు నిరసన
పరకాల నేటిధాత్రి
పహాల్గంలో పర్యటకులపైన చేసిన ఉదగ్రవాదుల దాడికి నిరసిస్తూ పరకాల కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి షాలినిలింగం మరణించిన పర్యాటకుల చిత్రపటాలకు కొవ్వాత్తులతో నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గురువారాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఉగ్రవాదులను త్వరగా పట్టుకుని శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ నవీన్,కిరణ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన
పరకాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ పరిధిలోని అడ్వకేట్స్ దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులను శిక్షించాలని ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక బస్టాండ్ కూడలిలో నిరసన వక్తం చేసారు.ఈ సీనియర్ న్యాయవదులు పి.రాజి రెడ్డి, రాజమౌళి,మెరుగు శ్రీనివాస్, స్వామి,చంద్రమౌళి,గండ్ర నరేష్ రెడ్డి,రమేష్ రాహుల్ విక్రమ్, సురేష్,రాజు,చంద్ర మోహన్, పవన్ కళ్యాణ్ మరియు కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.