Family Seeks Help for Man Suffering from Muscular Dystrophy
కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణ
-రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం
-దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకోలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమట్ల గ్రామానికి చెందిన పసునూటి బాలకృష్ణ గత ఆరు సంవత్సరాల నుండి కండరాల క్షీణిత వ్యాధితో బాధపడుతుండేవాడు. రూ.10 లక్షల వరకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఖర్చు పెట్టుకున్నప్పటికీ..ఆ వ్యాధి నయం కాకుండా మంచాన పడ్డాడు. దీంతో విధి వక్రీకరించిన ఆ కుటుంబం వీధిన పడ్డట్లయ్యింది. పసునూటి బాలకృష్ణకు భార్య స్రవంతి ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, విష్ణు ప్రియలున్నారు. రోజువారి కూలి పనులు చేసుకుంటూ..భార్య శిరీష కుటుంబ జీవనాన్ని వెల్లదీస్తుంది. దీనికి తోడు కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణకు నెలకు రూ. 20వేల వరకు మెడిసిన్ ఖర్చు అవుతుంది. అలాగే అదే వ్యాధితో పసునూటి బాలకృష్ణ సోదరీమణులు బాధపడుతున్నారు. కండరాల క్షీణిత వ్యాధి నుంచి బాధపడుతున్న వీరిని రక్షించేందుకు మానవత్వం కలిగి ఉన్న దాతలు స్పందించి..రెక్కాడితే గానీ డొక్కాడని ఆ నిరుపేదల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఆ కుటుంబాలకు విరాళాలు ఇచ్చి..బాధిత కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు వచ్చే దాతలు ఫోన్ పే నెంబర్ 8309029249, గూగుల్ పే నెంబర్ 9666321300 లకు విరాళాలు ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
