CPI Membership Renewal Meeting Held at Tangallapalli
సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత పునర్ధరణ కార్యక్రమం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిపిఐ ముఖ్య సమావేశం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు ఈసందర్భంగా ఖమ్మం లో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలక్యాడర్ను పెంచుకుంటూ పోరాటాలు కొన.సాగించిందని. అలాగే ఈ క్రమంలో .100 .సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో అనేక త్యాగాలు చేసిందని అన్యాన్యమైనపోరాటాలు చేసిందని. ఈ సందర్భంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తంగళ్ళపల్లి మండలం .లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన .సింగిరెడ్డి భూపతిరెడ్డి. నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడి మందాపూర్. గుట్టల్లో.నైజం పోలీసులచే.బూటకం ఎన్కౌంటర్లో అమరుడు.య్యారని. ముఖ్యంగా ఉపాధి హామీ చట్టం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ఉపాధి హామీ కార్మికుల అనేక అడ్డంకులు సృష్టిస్తూ అనేక సమస్యలను సృష్టిస్తూ ముఖ్యంగా .ముఖ కలకలు.వినిపించాలని ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టాలు కార్మికులను ఉపాధి హామీ పథకాన్ని దూరం చేసే పద్ధతి కొనసాగుతుందని. ఈ.జీ.ఏ.పథకాన్ని తీసేసి జి.రాo.జి. చట్టాన్ని తీయడానికి తీవ్రంగా.వ్యతిరేకిస్తున్నాం అని ఈ చట్టం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు 90% నిదులు .కేటాయించగా. ఇప్పుడు కేంద్రం 60 శాతం గాను రాష్ట్రాల 40% గానూ రాష్ట్రాల మీద భారం పడుతుందని ఇది .జిరాంజీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని.జిరాంజీ పథకంలో యంత్రాల వాడకాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం మనీ. ఈజీఎస్ పథకంలో 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ. నెలల తరబడి పని చేసే కార్మికులకు డబ్బులు ఇవ్వకపోవడం మూలంగా. ఈజీఎస్ అని అంటేనే కార్మికులకు.విసుక్కునే పరిస్థితి వస్తుందని. కార్మికుల ఉపాధి హామీ పథకంలో పని కావాలంటే స్థానిక ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకుంటేనే పని దొరికేది పని హక్కుగా కొనసాగింది. బిజెపి ప్రభుత్వం పని హక్కును రద్దుచేసి కేవలం పథకంగా అమలు చేసే పద్ధతిని బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిందని తక్షణమే ఈజీఎస్ కొనసాగించాలని చట్టాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా. ప్రతి సంవత్సరం సిపిఐ పార్టీ సభ్యత్వ పునర్ధరణ కార్యక్రమం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిపిఐ ముఖ్య సమావేశo. సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు. ఆధ్వర్యంలో నిర్వహిస్తూ సిపిఐ పార్టీ సభ్యత పునర్ధరణ కార్యక్రమం లో. భాగంగా మండల శాఖ సిపిఐ సభ్యత పునర్ధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో. సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
