
Participated in the meeting organized by Revanth Reddy
తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో స్థానిక నాయకత్వం,ఇంచార్జి లతో సమావేశమై… దిశా నిర్దేశం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.నియోజకవర్గ అభివృద్ది,ప్రజలకు ప్రజా ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ కార్యక్రమాల పై ప్రచార ప్రణాళికలు రూపొందించుకోవాలని, గెలుపే లక్ష్యంగా గల్లీ కార్యకర్త నుండి రాష్ట్ర నాయకత్వం వరకు పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,మంత్రులతో కలిసి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి వారితో పాటు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.