ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్
నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశము పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో ముఖ్య అజెండాగా ఎస్ ఏ -1 ఫలితాలపై అపార్ చర్చించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఆధార్ తరహాలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 17 అంకెలు ఉండే గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుందని, దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కార్పోరేట్ విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార తరహా అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) అందుబాటులోకి రానున్నదని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా అందించిందని అన్నారు. విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు మారేక్రమంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, విద్యార్థులు వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కూడా ఈ కార్డు చెల్లుబాటు అవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నదని, విద్యార్థుల పురోగతిని డ్రాప్ అవుట్ పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఎన్జీఏ ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లు, స్కాలర్ షిప్ పంపిణీ, ప్రభుత్వ ప్రయోజన బదిలీ, అవార్డుల జారీ వంటి మొదలైన వాటిలో అపార్ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. అపార్ వివరణ అనంతరం తల్లిదండ్రులను అపార్ ను అంగీకరిస్తూ అంగీక పత్రం ఇవ్వవలసినదిగా ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ కోరారు. దానికి తల్లిదండ్రులు సమ్మతిస్తూ అపార్ అంగీకార పత్రమును ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్, నిగ్గుల శ్రీదేవి, విద్యా వాలంటీర్లు బాబు రావు, పర్శవేనీ జ్యోతి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య, ఎస్ఎంసి చైర్మన్ అమ్మ హారిక, రమేష్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.