తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి……!!!

Sheikh Rabbani... Sheikh Rabbani...

తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి……!!!*

◆:- ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్/ఝరాసంగం: ఝరాసంగం ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ మాట్లాడుతూ తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి.. సర్కార్ బడులల్లో సదువుతున్న మీ పిల్లలకు సౌలతులు ఎట్లున్నాయో అరా తీయుర్రి.. రాష్ట్ర సంపాదనలో సగం వాట మీరు పన్నుల రూపంలో కట్టిన సొమ్ములే..ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాల కోసం పని చేయాలి..నాయకులు, ఓట్లేసిన జనాలకు జీతగాళ్లు.ఇంకా నాయకులు ముందు సంకల చేతులు కట్టుకోని నిలబడడం బంద్ చెయ్యాలి.. బజాప్తాగా సర్కార్ స్కూళ్ళను సందర్శించి,మధ్యాహ్న భోజనాన్నిరుచిచూడండి..విద్యార్థులకు సరిపోయే టీచర్లు ఉన్నారో, లేరో తెలుసుకోవాల్సిన ఉంది,ఆడపిల్లలకు సరిపోయేన్ని టాయిలెట్లు,మరుగుదొడ్లు ఉన్నాయో లేవో అడిగితేల్సుకోండి,రేపు మాపో సర్పంచ్ ఎన్నికల ప్రచారాలకు నాయకులు వస్తే,మీ ఊరి గవర్నమెంట్ బడులల్లో ఏదైనా సమస్యలు ఉంటే ఎక్కడికక్కడ నిలదీయండి..పేద పిల్లలు చదువుకుంటే ప్రభుత్వాలను ప్రశ్నిస్తారని, పేదోళ్లకు సదువు అందియకుండా, అగ్రవర్ణాల నాయకులు ప్రభుత్వ ఉద్యోగస్తులను సంకల పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు..పొమ్మనలేక పొగబెట్టినట్టు సర్కార్ స్కూళ్ళను సర్వనాశనం చేస్తున్న పలుకుబడి నాయకులు. జర జాగ్రత్త వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఓట్లు డిగే వారిని ప్రశ్నించలని. మనకు ఎవరు అందుబాటులో ఉండి పనిచేస్తారో ఆ నాయకుని దృష్టిలో పెట్టుకుని లేక మనకు వెనుకుండి కత్తి పోర్చు పొడిచే నాయకుని దృష్టిలో పెట్టుకొని వాళ్లను రాబోయే స్థానిక ఎన్నికలో గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.మండల పరిధిలోని అన్ని గ్రామాల యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కూడా యువత ఐక్యమత్యంగా ఉండి ఎన్నికల్లో పోటీ చేసి యువత గెలిచేల పనిచేస్తామని,గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధికి దోహదపడుతుందని,గ్రామఅభివృద్ధి యువతతోనే సాధ్యమని రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎలక్షన్లను తప్పకుండా యువత గెలుస్తుందని మండల పరిపాలన మొత్తం యువత చేతుల్లో ఉంటుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!