ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి.

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి.

#ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధానోపాధ్యాయుడు ఉడత రాజేందర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

మండలంలోని కొండైల్ పల్లి గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించవలసిందిగా కోరుతూ ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉడుత రాజేందర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, 2 జతల యూనిఫామ్స్ ,సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, వారానికి 3కోడిగుడ్లు ,నాణ్యమైన ఉచిత విద్య, వెనుకబడిన విద్యార్థుల పట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన, అర్హత గల ఉపాధ్యాయులచే విద్య బోధన చేయడం జరుగుతుందని. ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తల్లిదండ్రుపై ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఈర్ల సుమలత, అంగన్వాడి టీచర్ రజిత ,ఆశ కార్యకర్త జ్యోత్స్న, పాఠశాల ఉపాధ్యాయులు పోరిక రవికుమార్, మాజీ ఎస్ఎంసి చైర్మన్ ఊరటీ నరేష్, గ్రామస్తులు లింగారెడ్డి , ముకుంద రెడ్డి, ప్రతాప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version