చట్టాలపై అవగాహన సదస్సు

చట్టాలపై అవగాహన సదస్సు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డులోని పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్, గోపాల్ నగర్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జ్ కం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు.

గృహహింస మరియు మహిళలు ఎదుర్కొంటున్న అనేక చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు,జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు, శ్రీ.గుర్రం ఆంజనేయులు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్,ఈ.జ్యోతి, అడ్వకేట్లు,గెంట్యాల భూమేష్, తిరుపతి, అనుష, అరుణ, అలేఖ్య మరియు 19వ వార్డు మాజీ కౌన్సిలర్,అన్నారం శ్రీనివాస్, జి.జ్యోతి, డి.అనుష, టి.కావ్య, వి.సునీత మరియు వార్డు మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు 19వ వార్డు మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ మరియు మహిళలను జడ్జి రాధిక జైస్వాల్ అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version