బీజేపీ నాయకులకు నా ధన్యవాదాలు -పాలకుర్తి తిరుపతి
పరకాల నేటిధాత్రి
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పరకాల అసెంబ్లీ ఎస్టీ మోర్చా ఇంచార్జ్ గా శుక్రవారం రోజున పాలకుర్తి తిరుపతి ని నియమించడం జరిగింది. ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ నాపై నమ్మకంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భారతీయత పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి పరకాల అసెంబ్లీ ఎస్టి మోర్చా ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించిన బిజెపి రాష్ట్ర ఆధ్యక్షులు జి కిషన్ రెడ్డి మరియు ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజరాల ప్రేమేందర్,బిజెపి జిల్లా అధ్యక్షురాలు రావు,పద్మా రెడ్డి,డాక్టర్ పెసర్ విజయచందర్ రెడ్డి,డాక్టర్ సంతోష్ కుమార్,డాక్టర్ ఖాళి ప్రసాద్,కాచం గురు ప్రసాద్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంత్ లాల్,మార్త బిక్షపతిలకు బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.