పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేసినందుకు గాను రేవంత్ రెడ్డి చిత్రపటానికి శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలనుసారం హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక బస్టాండ్ కూడలిలో పాలభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగురి బిక్షపతి పరకాల పట్టణ మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ అలీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుబాసి వెంకటస్వామి,రంజాన్ అలీ,జాఫర్ రిజ్వి, సాధిక్,ఆశ్రఫ్,షఫీ,పరకాల పట్టణ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి, పరకాల పట్టణ ముస్లిం సోదరులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *