వీణవంక. (కరీంనగర్ జిల్లా),
నేటిదాత్రి:వీణవంక మండల కేంద్రం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వీణవంక లోని తన నివాసం నుండి గోమాతకు పూజలు చేసి వారి సతీమణి పాడి శాలిని పాడి కౌశిక్ రెడ్డి నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు.ఆయన సతీమణి వీరతిలకం దిద్ది ఎదురొచ్చారు. ఎన్నికలో విజయం సాధించాలన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల పరిధిలోని గోపాల్ పూర్ గ్రామం లో దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, జెడ్పిటిసి మాడ వనమాల సాదవ రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సర్పంచులు మర్రి స్వామి,ముత్తయ్య, జ్యోతి రమేష్, నరసయ్య, సారయ్య, రమేష్, సునీత మల్లారెడ్డి,మాజీ సర్పంచ్ అడిగొప్పుల సత్యనారాయణ, ఎంపీటీసీ స్వరూప , లక్ష్మి నాయకులు పొన్నాల అనిల్ కుమార్, చదువు నరసింహారెడ్డి, మహేందర్ రెడ్డి, ఇప్పలపల్లి మధుసూదన్ రెడ్డి రెడ్డి, కార్యకర్తలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.