పత్తిపాక గ్రామంలో గుడ్లగూబ పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కర్త, ప్రధాన వక్తగా హాజరైన డాక్టర్ నలిగంటి శరత్

అతిధులు, ప్రముఖ న్యాయవాది, బహుజ మేధావి, బండి మొగిలి

పుస్తక సమీక్షకులు డాక్టర్ కట్కూరి మహేందర్

శాయంపేట నేటిధాత్రి:

హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో చెల్పూరి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన చెల్పూరి మొగిలి రాసిన గుడ్లగూబ పుస్తకా విష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
పుస్తకావిష్కర్తగా హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి నాయకులు డాక్టర్ నలిగంటి శరత్ చమార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఈ గుడ్లగూబ పుస్తకము చదివి తీరాలి చెల్పూరి మొగిలి రాసిన ఈ గుడ్లగూబ పుస్తకం బహుజన సాహిత్యానికి ఒక చైతన్య వారధిగా నిలుస్తుంది అన్నారు సమాజంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల పట్ల చాలా స్పష్టమైన అవగాహనతో విశ్లేషించి రాసినదే ఈ గుడ్లగూబ పుస్తకం అన్నారు. అతిధులు : ప్రముఖ న్యాయవాది అబేడ్కరీస్ట్ బహుజన మేధావి బండి మొగిలి మాట్లాడుతూ ప్రజాస్వామ్య మానవతా విలువలను, సామాజిక అసమానతలను పారదోలే చైతన్య ధివిటి చెల్పూరి మొగిలి రాసిన ఈ గుడ్లగూబ పుస్తకం అన్నారు. ప్రతీ మనిషిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది అది స్థాయికి, కులానికి, రంగుకు, సంబంధం లేనిది తమలో ఉన్న గొప్ప కళని గుర్తించి బైటికి తీసుకురావడం సమాజ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం అన్నారు.
పుస్తక సమీక్షకులు డాక్టర్ కట్కూరి మహేందర్ మాట్లాడుతూ “గుడ్లగూబ పుస్తకం ఏ ఒక్క వాదానికి పరిమితమైనది కాదు. సకల భావోద్వేగాల సమ్మేళనం, కాలాతీతమైన పుస్తకం ఇది అన్నారు”. ఈ పుస్తకంలోని అంశాలు కరోన సంక్షోభిత సమయంలోని, రైతుల కష్టాలు, పల్లె ప్రకృతి అందాలు, రైతు కూలీలు, ఇలా అనేక అంశాలను తీసుకొని చాలా అద్బుతమైన బాషా సౌందర్యంతో రాసినదే ఈ గుడ్లగూబ పుస్తకము అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జన నిర్ణయం దినపత్రిక ఎడిటర్ దామెర రాజేందర్ మాట్లాడుతూ గుడ్లగూబ పుస్తకం రాయడం అభినందనియం నేటి సమాజానికి ఆస్తులు, పాస్తులే కాదు మనిషిలోని కలలు కూడా ఒక గొప్ప వారసత్వ ఆస్తిగా భావించాలి. సమాజంలో గాని కుటుంబంలో గాని మనుషులు బ్రతికున్నప్పుడే వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసి సరైన సమయంలో గుర్తింపు ఇవ్వాలి. సాటి మనిషికి తోడుండాలి అన్నారు. అలా ఉన్నప్పుడు మాత్రమే మానవత్వపు వారసత్వ సమాజం జీవంతో ఉంటుంది అన్నారు. ఐరబోయిన భిక్షపతి మాట్లాడుతూ గుడ్లగూబ పుస్తకం చూసే దృష్టికోణాన్ని బట్టి పుస్తకం కనిలిస్తుంది. మనిషి దృష్టిలోనే తమ తత్వం దాగి ఉంది అన్నారు. మాజీ సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ పత్తిపాక గ్రామానికి గర్వకారణం ఇలాంటి పుస్తకాలు రాసే వారసత్వం ఉన్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. చెల్పూరి మొగిలి కవిగా సమాజానికి ఇంకా గొప్పగా తమ సేవలు అందించాలని అన్నారు.కందకట్ల గణేష్ మిత్రులు మాట్లాడుతూ చెల్పూరి మొగిలి బాల్య దశ నుండే సాహిత్య మేలుకువలు ఉన్న, మంచి కవి, చిత్రకారులు అని కొనియాడారు. అదే విధానంగా ఈ కార్యక్రమంలో ద్రావిడ కళా సాంస్కృతిక మండలి వ్యవస్థాపక అధ్యక్షులు, రామంచ భరత్, తమ గళం విప్పి పాటలతో యావత్ ప్రజానీకాన్ని చైతన్య పరిచారు. ప్రజా వాగ్గేయ కారులు యోచన మాట్లాడుతూ మనిషిలోని కళలను గుర్తించి సమాజంలో మంచి గుర్తింపు, ప్రోత్సాహాం, ఆర్థిక పరమైన సహకారం లేకపోవడం వల్ల ఎంతో మంది వెలుగులోకి రావడం లేదు. అన్నారు. కవి మొగిలి అభినందలు తెలిపారు. హైదర్ మాట్లాడుతూ మొగిలి బాల్యంలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొని ఉన్నతమైన భావాలతో కూడిన పుస్తకం రాయడం అభినందనీయం అన్నారు. మాతృక టీవీ సి ఈ ఓ లారా రాజు, పల్లెబోయిన సుధాకర్, ఆవునూరి విరాట్, సుమన్, పవన్న, గుర్రం రమేష్, నకిరబోయిన రాము, ప్రకాష్, వీరగాని భాస్కర్, మంద నరేష్, మంద శ్రీకాంత్, కళ్లెపెళ్లి ప్రశాంత్, అమృత రాజు, అనిల్, కాకతీయ యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, పత్తిపాక గ్రామ కుల సంఘాల పెద్దలు, యువత, మహిళలు, కుటుంబ సభ్యులు, గుడ్లగూబ పుస్తక రచయిత కవి చెల్పూరి మొగిలికి అభినందనలు తెలిపి కార్యక్రమాన్ని విజవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!