తక్షణమే ఆపరేషన్ కగార్ ఆపాలి.

Marupaka Anil Kumar DHPS Marupaka Anil Kumar DHPS

తక్షణమే ఆపరేషన్ కగార్ ఆపాలి.

బేషరతుగా చర్చలు ప్రారంభించాలి.

మారుపాక అనిల్ కుమార్
డి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

వరంగల్ నేటిధాత్రి.

 

 

 

ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నరమేధాన్ని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు శివనగర్, తమ్మెర భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతు, నక్సలిజాన్ని అంతం చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం, పేదరికాన్ని ఎందుకు అంతం చేయలేకపోతుంది అని ప్రశ్నించారు. మావోయిస్టులతో బేషరతుగా చర్చలు జరిపి, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. 2025లో ఇప్పటివరకు మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీలు కలిపి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయారు అని, దేశ చట్టాలు, సాయుధ ఘర్షణలకు సంబంధించిన నియమాలను పక్కన పెట్టి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మావోయిస్టులను భౌతికంగా నిర్మూలించేందుకు సాయుధ బలగాలను వినియోగిస్తోంది అని అన్నారు. కర్రెగుట్ట కొండలను పారా మిలిటరీ బలగాలతో చుట్టివేయటం, ఆదివాసీల హక్కులను పూర్తిగా పట్టించుకోకపోవటం అభీష్టకరమైంది కాదన్నారు.

శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం నిర్లక్ష్యం.

సి.పి.ఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తమ శాంతియుత చర్చల సన్నద్ధతను ఇప్పటికే ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇకపోతే, మావోయిస్టులు ఒకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాస్వామిక శక్తులు ఐక్యం కావాలి అని,
మావోయిస్టుల ప్రతిపాదనకు బదులుగా ప్రభుత్వం షరతులు విధించడం శాంతి లక్ష్యాలకే వ్యతిరేకమని అన్నారు. ప్రజాస్వామిక పద్ధతుల్లోనే శాంతిని సాధించాలి. అందుకే అన్ని ప్రజాస్వామిక సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి తక్షణ కాల్పుల విరమణ, బేషరతు చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. భౌతిక నిర్మూలన కాదు, రాజ్యాంగబద్ధ పరిష్కారం కావాలి అని డి హెచ్ పి ఎస్ స్పష్టం చేస్తోంది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!