ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలి
కన్నూరి దానియల్ ఏఐ సిసి టియు జిల్లా కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని
ఏఐ సిసిటియు జిల్లా కార్యదర్శి కన్నూరి దానియల్
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2026 మార్చినాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఫాసిస్టు చర్యల్లో భాగమేనని ఆయన విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటివరకు 1000 మంది కీ పై చట్ట విరుద్ధంగా హత్య చేశారని తెలిపారు. ఆపరేషన్ కగార్ మూలంగా మృతుల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అక్కడి ప్రజలు భయానక స్థితిలో జీవనం కొనసాగించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడ్డాయని ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే న్యాయ విచారణ చేపట్టాలని అన్నారు
ఈ చట్టవిరుద్ధ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కొనసాగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేయాలని అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన సాగుతుందన్నారు. శత్రు దేశాలపై యుద్ధం చేసినట్లు ఈమధ్య భారత్లో భారత పౌరులపై యుద్ధం చేయడం సరికాదన్నారు. ఉగ్రవాద సంస్థలతో గత ప్రభుత్వాలు చర్చలు జరిపాయని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.