రామడుగు, నేటిధాత్రి:
రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల, గోపాలరావుపేట మార్కెట్ యార్డ్ లలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంబించారు. ఈకార్యక్రమంలో జిల్లా సహకారశాఖ నోడల్ అధికారి ఎండీ జలలోద్ధిన్ అక్బర్, మార్కెట్ సూపర్ వైజర్ రాజేశం, పాక్స్ సెక్రటరీ కే.మల్లేశం, సెంటర్ ఇంఛార్జిలు, రైతులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.