క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి

మందమర్రి, నేటిధాత్రి:-

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని సింగరేణి సంస్థ ఏరియా ఎస్ఓటు జిఎం ఏ రాజేశ్వర్ రెడ్డి, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ లు తెలిపారు. ఏరియా వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యుపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 59వ వార్షిక క్రీడల్లో భాగంగా శనివారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన నియర్ బై ఏరియా క్రికెట్ పోటీలకు వారు ముఖ్య అతిధులుగా హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడాకారులు కంపెనీ, కోలిండియా స్థాయి పోటీల్లో సైతం పాల్గొని, ఏరియాకు, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఎస్ఇ జయప్రకాష్, క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, క్రీడల సమన్వయ కర్త ఏ రవికుమార్, జనరల్ కెప్టెన్ టి చిన్నన్న, సింగరేణి మైదానం ఇంచార్జ్ నస్పూరి తిరుపతి, క్రీడాకారులు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!