చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి (సివిల్ రైట్స్ డే) ఆర్ ఐ శివరామకృష్ణ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మొగుళ్ళపల్లి రెవిన్యూ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ సూచించారు. మొగుళ్ళపల్లి మండలం కొరికి శాల గ్రామంలో శనివారం జరిగిన సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో వారు మాట్లాడారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతోపాటు సమస్యలపై స్పందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకోవాలని, సక్రమంగా అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్ ఐ శివ రామకృష్ణ ఏఎస్ఐ రాజేశం గ్రామాకార్య దర్శి రాజాశేఖర్ గ్రామస్థులు పాల్గొన్నారు.