వరంగల్ టెక్స్ట్ టైల్ పార్కులో మహిళలకు లక్ష ఉద్యోగాలు

# మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, వివో శాశ్వత భవనాల మంజూరు పత్రాలు, బతుకమ్మ చీరలు యువకులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ,
# అధికారిక కార్యక్రమాల కోసం మొబైల్ యాప్ ను ప్రారంభం
# పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

నర్సంపేట , నేటిధాత్రి :

ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టెక్స్టైల్ పార్కులో రాబోయే ఐదు సంవత్సరాలలో మహిళలకు లక్ష ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.నర్సంపేట డివిజన్ పరిధిలోని మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ల పంపిణీ కార్యక్రమం శిక్షణపై అవగాహన సదస్సులో బాగంగా నెక్కొండ మండలంలో ఇటీవల ఉచిత శిక్షణ తరగతులు పూర్తిచేసుకున్న అభ్యర్థులు 500 మందికి కుట్టు మిషన్లను అందజేశారు.అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా మిగిలిన మండలాల్లో మొత్తం 3,000 మంది మహిళలకు ఉచిత శిక్షణతో పాటు కుట్టు మిషన్ లు అందజేసీ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో 100 శాతం మహిళా సంఘాలకు (వి ఓ) శాశ్వత భవనాల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి అందజేశారు.దసరా పండుగను పురస్కరించుకుని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వారు అధికారికంగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని 197 గ్రామాల యువతకు అన్ని రకాల గేమ్స్ మెటీరియల్ తో కూడిన స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధికారిక కార్యక్రమాలు రోజువారీ షెడ్యూల్ అప్ డేట్స్ కొరకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నియోజకర్గంలో మొత్తం 317 మంది ఆడ పడుచులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.


నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పలు రకాల ప్రభుత్వ పంపిణీ పథకాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండేందుకు కెసిఆర్ ప్రభుత్వం వివిధ రకాల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను పలు పథకాలను చేపట్టిందన్నారు. రాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గం మొదటి ప్రాధాన్యత కలిగించే విధంగా స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చూపిస్తున్నారని పేర్కొన్నారు. పలు దఫాలుగా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉచితంగా కుట్టు మిషన్లు ఎమ్మెల్యే పెద్ది ఆధ్వర్యంలో అందుతున్నాయన్నారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటుచేసిన టెక్స్ట్ పార్కు లో రాబోయే ఐదు ఏళ్లలో మహిళలకు లక్ష ఉద్యోగాలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని అందులో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్సీ వివరించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్బంగా అన్ని వర్గాల మహిళలకు కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదన్నారు. ఆడపడుచు పెళ్లి చేస్తే ఇంటికి భారం కావద్దని భరోసాతో ఒక మేనమామగా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష 116 రూపాయలను అందిస్తున్నారని ఈ పథకం దేశంలో ఎక్కడ లేదని పేర్కొన్నారు. గ్రామ మహిళా సమాఖ్య సంఘాల భవనాలు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారనే నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపించడం వలన నేడు శాశ్వత భవనాలకు పునాదిరాయి పడిందన్నారు. క్రీడల వలన యువత మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగం పడుతుందని ఉద్దేశంతో గ్రామ గ్రామాన తెలంగాణ క్రీడ ప్రాంగణాలను కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని కిషన్, అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు పిఎసిఎస్ చైర్మన్లు, అన్ని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ బాధ్యులు, రైతు సమన్వయ సమితి బాధ్యతలు, ఏపీఎంలు, పార్టీలకు అతీతంగా నియోజక వర్గంలోని అన్ని గ్రామాల యువజన సంఘాలు,అన్ని మండలాల మహిళా సమాఖ్య సంఘాల అధ్యక్ష్యులు,సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!