రైతులకు ఒక న్యాయము నాయకులకు మరో న్యాయమా

నాయకులకు సంబంధించిన తడిసిన వడ్లు తూకం వేయడం?

వరి కోసిన రెండు రోజుల్లోనే లారీలల్లో ఎక్కించడమా?

మామూలు రైతుల గోడు అధికారులకు పట్టదా?

నిజాంపేట్ , నేటి ధాత్రి

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో రైతులు గత 20 నుండి 25 రోజులుగా వరి కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పలు చేసి తూకం కంట చేయమని నిర్వాహకులను అడగగా సీరియల్ రావాలి వచ్చినప్పుడే కాంట పెడతాము అని రైతులను సెంటర్ల చుట్టూ రోజుల తరబడి తిప్పుతున్నారు. అకాల వర్షానికి ఎండిన వడ్లు తడిసి ఒకపక్క మొలకలు రావడం జరుగుతుంది. అయినా రైతులు మళ్లీమళ్లీ ఆరబెట్టి వరి ధాన్యాన్ని శుద్ధి చేయడం జరుగుతుందన్నారు.
కానీ గ్రామానికి చెందిన ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి విజయ్ సంతు రెడ్డి వారికి సంబంధించిన వరి ధాన్యాన్ని ఆరబెట్టకుండానే తడిసిన ధాన్యం వరికోసిన ఒకటి రెండు రోజులలో బస్తాలు నింపి ధాన్యాన్ని లారీలల్లో ఎక్కించడం జరుగుతుంది రైతులు ఆవేదన చెందుతున్నారు . రైతులేమో కొనుగోలు సెంటర్ల చుట్టూ తిరుగుతూ తడిసిన వడ్లను అష్ట కష్టాలు పడుతూ మళ్లీ మళ్లీ ఆరబెట్టి సీరియల్ కొరకు ఎదురు చూస్తే నాయకులేమో ఇండ్ల దగ్గర వరి ధాన్యం పోసుకొని రాత్రికి రాత్రి ధాన్యాన్ని బస్తాలలో నింపి లారీలల్లో ఎక్కించడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నాయకులకు ఒక న్యాయమా రైతులకు మరో న్యాయమా అని రైతులు ఆవేదన చెందుతున్నారు.అకాల వర్షానికి ధాన్యం తడిసి ఒకపక్క మొలకలు వస్తుంటే నాయకులు వరి కోసిన రెండు రోజులలో ధాన్యం లారీలల్ల చేర్చడం ఎంతవరకు సమంజసం అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంతే అధికారం లేనప్పుడు అంతేనా? ఇలా కొనసాగితే రైతుల పరిస్థితి ఏంటని వారి ప్రశ్నిస్తున్నారు.సెంటర్లలో రైతుల బస్తాలు తూకం వేసి లారీలు రాక ఇబ్బంది పడుతున్న రైతులు కానీ అప్పటి కప్పుడు నాయకులకు లారీలు తెప్పించి ధాన్యాన్ని నింపి తరలించడం ఇదే న్యాయమని అంటున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లా అధికారులు రైతుల ధాన్యాన్ని వీలైనంత తొందరగా లారీలు పంపించి ధాన్యాన్ని తరలించాలని రైతులు వేడుకుంటున్నారు ఇలానే కొనసాగితే సెంటర్ల దగ్గర ధర్నా చేస్తామని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!