తాటి చెట్లను జేసీబీతో తొలగించిన దుండగులపై.!

palm trees palm trees

తాటి చెట్లను జేసీబీతో తొలగించిన దుండగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

-తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామానికి చెందిన బోయిని అనిల్ కుమార్, బోయిని శ్రీకాంత్ అనే వ్యక్తులు జేసీబీ సహాయంతో తాటివనం చెట్లను తొలగించారని, ఈ దుండగులపై సంబంధిత శాఖ అధికారులు క్రిమినల్ కేసులో నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన తన చరవాణితో విలేకరులతో మాట్లాడారు. గురువారం రోజున కొర్కిశాల గ్రామానికి చెందిన పై వ్యక్తులు తమ భూమి ఒడ్డుకు..అసైన్మెంట్ భూమిలో ఉన్న తాటివనం చెట్లను జేసీబీతో తొలగించి గౌడ కులస్తుల ఉపాధిని దెబ్బ తీశారని, గీతా వృత్తినే నమ్ముకుని జీవనాధారం కొనసాగిస్తున్న గౌడ కులస్తుల ఉపాధిపై దెబ్బతీసిన వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన అధికారులను కోరారు.

దరఖాస్తు ఇవ్వండి
-ఇంక్వైర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
-ఎక్సైజ్ సూపరీండెంట్ వేముల శ్రీనివాస్

కాగా తాటి వనం చెట్లను నరికిన విషయాన్ని జై గౌడ ఉద్యమం రాష్ట్ర కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరీండెంట్ వేముల శ్రీనివాస్ తో ఫోన్ ద్వారా విషయం తెలుపగా..దరఖాస్తు ఇవ్వండి..ఎంక్వైరీ చేసి తాటి వనం చెట్లను నరికిన బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

-తహసిల్దార్ జాలీ సునీత రెడ్డి వివరణ

అసైన్డ్ భూమిలో ఉన్న తాటి వనం చెట్లను జేసీబీతో తొలగించిన విషయాన్ని మొగుళ్ళపల్లి తహసిల్దార్ జాలీ సునీత రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా..విచారణ చేపడతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!