అమరవీరుల దినోత్సవం సందర్భంగా , రామాయంపేట పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరం

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి.


మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ రామాయంపేట పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించి రామాయంపేట పోలీసులు,స్థానిక యూత్ నాయకులు యువకులు150 మంది వరకు రక్తదానం చేశారు. అనంతరం మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీసు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ వారోత్సవాలలో పోలీసు అమరవీరుల కుటుంబాలు సందర్శించడం జరుగుతుందని అలాగే ప్రతి సంవత్సరము రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి స్థానిక యూత్ నాయకులకు, యువకులకు పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి,రామాయంపేట సిఐ లక్ష్మీ బాబు, ఎస్సై రంజిత్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, పి లక్ష్మణ్ యాదవ్, జిల్లా కార్యదర్శి సుభాష్ చంద్రబోస్,కార్యవర్గ సభ్యులు దేమే యాదగిరి,దామోదర్ రావు,సతీష్ రావు,జిల్లా కోశాధికారి సీనియర్ పాత్రికేయుడు డీ.జి.శ్రీనివాస శర్మ,తో పాటు శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *