ఉత్సవాల విజయంలో అధికారుల సేవలు మరువలేనివి
ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నా రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మండలంలోని ముల్కలపల్లి – మొగుళ్ళపల్లి రెండు గ్రామాల పరిధిలో శ్రీ సమ్మక్క సారక్క ఉత్సవాల విజయంలో అధికారుల సేవలు మరువలేనివని మినీ మేడారం సమ్మక్క సారాలమ్మ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డి, అన్నారు. శనివారం సాయంత్రం కోయ పూజారులు అమ్మవార్లను ఆదివాసుల సంస్కృతి సంప్రదాయం ప్రకారం వన ప్రవేశ కార్యక్రమం పూర్తి చేశారు. అనంతరం, మొగుళ్ళపల్లి ములకలపల్లి సర్పంచులు చాట్ల విజయ రవీందర్ నాంపల్లి శ్రీవాణి రమేష్ లు మాట్లాడుతూ.

జాతర ఉత్సవంలో ముఖ్యంగా మొగుళ్లపల్లి ఎస్సై అశోక్, పోలీస్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం విధుల్లో పాల్గొని జాతర విజయంలో కీలక పాత్ర పోషించారని సర్పంచులు తెలిపారు. అనంతరం మొగుళ్ళపల్లి ఎస్సై. బొరగల అశోక్, పోలీస్ సిబ్బంది జ్యోతి, మమత, సునిత,హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, విజయ్, విద్యుత్ శాఖ అధికారులు, వెంకటేష్, రఘు, రమేష్, కిరణ్,ప్రసాద్ లను రెండు గ్రామాల సర్పంచులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్సాని నరసింగా రావు, నీల రాజు, కొడారి ఓదెలు, బండారి రామస్వామి, కట్ల శీను బాబ్జి, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.
