రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ విషయమై వార్డు సభ్యులు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై విచారణకు వచ్చిన డిఎల్పివో హరికిషన్. ఈసందర్భంగా వార్డు సభ్యుల వాంగ్మూలాలను, గ్రామ ప్రజలు వాంగ్మూలాలను తీసుకోవడం జరిగినది. ఈకార్యక్రమంలో ఆర్ఐ రజని, ఎంపిడివో భాస్కర్ రావ్, ఎంపివో రాజశేఖర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, డిఇ లచ్చయ్య, ఎఈ సచిన్, పంచాయతీ కార్యదర్శి పాషా, ఎంపిటిసిలు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, కరుణశ్రీ పాపిరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు రజబ్ ఆలీ, ఉపసర్పంచ్ ఎడవెల్లి మదుసుదన్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.