ఫూలే ఆశయాలను కొనసాగిస్తాం.

ఫూలే ఆశయాలను కొనసాగిస్తాం.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

 

మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణం, పద్మావతి కాలనీ లోని గ్రీన్ బెల్ట్ లో గల ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంట్లో ఒక్క మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో మొత్తం విద్యావంతులు తయారు అవుతారని నమ్మిన వ్యక్తి ఫూలే గారని ఆయన చెప్పారు. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలోనే మన పిల్లలు చదువుకోవాలని తన సొంత డబ్బులతో పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా మన పిల్లలకు విద్యను అందించారని, బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యలో సమాన అవకాశాలు ఉండాలని భావించారని ఎమ్మెల్యే తెలిపారు. విద్య మీద ప్రజా ప్రభుత్వం దృష్టి పెట్టిందంటే దానికి స్ఫూర్తి జ్యోతిబాపూలే గారే అన్నారు. ఆ రోజు బ్రిటిష్ వారు పాలిస్తున్న కాలంలోనే చదువు అంటే ఎవరికి తెలియని సమయంలో మన పిల్లలు చదువుకోవాలని, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని ఎన్నో పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించిన ఘనత ఫూలే అన్నారు. బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యలో సమాన అవకాశాలు ఉండాలని చెప్పి, మొట్టమొదటగా బ్రిటిష్ వారిని ఒప్పించిన ఘనత మహాత్మ జ్యోతిబాపూలే చేశారని, కొన్ని లక్షల మంది మేధావులను తయారు చేసే ఆలోచన విధానానికి రూపకల్పన చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర బోయి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version