
అంగన్వాడి టీచర్లు సరోజన కవిత
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి రూరల్ మండలంలోని గొర్లవీడు గ్రామంలో పోషణ మాస ఉత్సవాల సందర్బంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో గొర్లవీడు గ్రామంలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించి పోషణ విలువల గురించి తెలియజేయడమైనది ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపెర్వైజర్ సునిత మాట్లాడుతూ గ్రామంలోని గర్భినీలు, బాలింతలు, కిషోర బాలికలు, పిల్లలకు ఏ ఒక్కరికి పోషణ లోపం లేకుండా చూడాలన్నారు. గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే అంగన్వాడి టీచర్లకు వెంటనే తెలియజేయాలి అని సూచించారు
ఎం ఎల్ ఎచ్ కార్తీక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు ప్లాస్టిక్ రహిత గ్రామంగా గొర్లవీడు ను నిలపాలన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సరోజన,కవిత, వసుమతి,శారద, లత, సరళ,ఏ ఎన్ ఎం గీత, అంగన్వాడి హెల్పర్లు, ఆశా వర్కర్లు, వి ఏ ఓ లు,వి ఓ లు, తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.