NSUI Celebrates 56th Foundation Day
ఘనంగా ఎన్ ఎస్ యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవ
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐ ఎన్ టియుసి కార్యాలయంలో ఎన్ ఎస్ యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టెవాడ సురేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో భారత జాతీయ విద్యార్థి సంఘం ఎప్పుడు ముందుంటుందని విషయాన్ని చెప్పగా తప్పదు. అంతే కాకుండా రాబోయే రోజులలో విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్యలో వారదిగా ఉంటూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో భారత జాతీయ విద్యార్థి సంఘం ముందుంటుందని విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యుఐ జిల్లా ఉపాధ్యక్షులు పోతర్ల ప్రేమ్ కుమార్, శనిగరపు తిరుపతి, కిషోర్, విజయ్ భాస్కర్, తిరుపతి, రాజు, నాగరాజు, స్వాతికిరణ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు..
