మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె నోటీసు.

డీఈఓ కు వినతి పత్రం

నోటీసు అందజేస్తున్న సిఐటియు గౌరవ అధ్యక్షులు ఆకుదారి రమేష్.

భూపాలపల్లి నేటిధాత్రి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, ( సి ఐ టి యు,ఐ ఎన్ టి యు సి, ఏఐటీయూసీ,హెచ్ ఎం ఎస్, ఐ ఎఫ్ టి యు,బి ఆర్ టి యు,టి ఎన్ టి యు సి) కార్మిక సంఘాలు వివిధ రంగాల ఉద్యోగ సంఘాలు అఖిల భారత ఫెడరేషన్లు సంయుక్త కిసాన్ మోర్చా,రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక 2024 ఫిబ్రవరి 16న అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మెతో పాటు గ్రామీణ బంద్ పాటించాలని నిర్ణయించాయని రమేష్ అన్నారు..
ఈ నిర్ణయం లో భాగంగా మన రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కూడా సమ్మెలో భాగస్వాములు కావాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని, పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 22 సబ్ సెక్షన్( 1) అనుసరించి ఈ సమ్మె నోటీసు ఇస్తున్నామని పేర్కొన్నారు..
2024 ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బందులో మధ్యాహ్న భోజనం పథకం కార్మికులందరూ పాల్గొంటున్నారని ఈ సమ్మె నోటీసు ద్వారా డిఈఓ కి తెలియజేస్తున్నామని నూతన విద్యా విధానం 2022 చట్టాన్ని రద్దు చేయాలి. గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి. అవసరమైన గ్యాస్ను సబ్సిడీకి ఇవ్వాలి. గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వాలి. అక్రమ తొలగింపులు అరికట్టాలి.రాజకీయ వేధింపులు ఆపాలి. వంట సెట్లు వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించాలి. కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలి. సామాజిక భద్రత కల్పించాలి. ప్రమాద బీమా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని రమేష్ అన్నారు. ఆయనతోపాటు, స్వర్ణలత, బక్కమ్మ, సంపూర్ణ,లావణ్య, లక్ష్మీ, రజిత, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *