“Chrysanthemum Prices Crash, Farmers in Distress”
సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర
చామంతి రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పూల ధర భారీగా తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 15రోజుల్లోనే టన్నుపై రూ.70వేలు తగ్గడంతో.. ఏం చేయాలో పాలుపొలేని స్థితిలో రైతులు ఉండిపోతున్నారు.
పుట్లూరు(అనంతపురం): ధరలు తగ్గడంతో చామంతి రైతులు కుదేలవుతున్నారు. కేవలం 15రోజుల వ్యవధిలోనే టన్నుపై రూ.70వేలు తగ్గడంతో దిక్కుతోచని స్థితిలో చామంతి రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గత నెలలో ఆశాజనకంగా కనిపించిన ధరలు హఠాత్తుగా పాతాళానికి పడిపోయాయి. గత నెలలో టన్ను రూ.లక్షకు పైబడి అమ్ముడుపోగా ప్రస్తుతం రూ.30వేలకు పడిపోయింది. పుట్లూరు మండలంలో సుమారు 200ఎకరాల్లో వివిధ రకాల పూలతోటలను సాగుచేస్తున్నారు. అరకటవేముల, కొండాపురం, సూరేపల్లి, గొల్లపల్లి, పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లి, కొత్తపల్లి, ముచ్చుకోట తదితర గ్రామాల్లో పూల తోటలు సాగు చేస్తున్నారు.
