నల్ల రవికిరణ్ ను పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
10 వేల రూపాయల ఆర్థిక సహాయం, 50 కేజీల బియ్యం అందజేత
“నేటిధాత్రి” హనుమకొండ:
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) వరంగల్ జిల్లా అధ్యక్షులు నల్ల రవి కిరణ్ తండ్రి నల్ల రవీందర్ ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పరామర్శించారు. స్వర్గీయ నల్ల రవీందర్ చిత్రపటానికి నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. నల్ల రవికిరణ్ ను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పదివేల రూపాయల ఆర్థిక సాయం 50 కేజీల బియ్యాన్ని వారి కుటుంబానికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాంచాలక్క, గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్షులు ఉచత శ్రీకాంత్, ఉపాధ్యక్షులు గూడూరు నరేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, అధికార ప్రతినిధి వేల్పుల మణెమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్, రామ్మూర్తి, రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ కోడిపాక రవి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా ప్రచార కార్యదర్శి సురేందర్, నల్లబెల్లి మండల అధ్యక్షులు ఆవునూరి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి నర్మెట్ట యాదగిరి, కె. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.