ఎన్ హెచ్ఆర్సి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా అయిలోని అభిషేక్.
వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:
మానవ హక్కుల సంఘం సోషల్ మీడియా వరంగల్ జిల్లా కన్వీనర్ గా గీసుగోoడ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అయిలోని అభిషేక్ ను నియమిస్తూ స్టేట్ చైర్మన్ బద్దిపడిగా శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.తనపై నమ్మకంతో బాధ్యతను అప్పజెప్పిన నేషనల్ చెర్మెన్,డాక్టర్ మహమ్మద్ యాసీన్, వరంగల్ జిల్లా అద్యక్షులు గంగుల అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ హెచ్ ఆర్ సి సంస్థలో తన కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నెరవేస్తానని తెలిపారు. ఎల్లప్పుడూ రాష్ట్ర అధ్యక్షులు వారికి జిల్లా తోటి సభ్యులకు అన్ని విధాలుగా సహకారం అందజేస్తానని అన్నారు. పేద ప్రజల తరఫున చట్టపరమైన దిశలో మానవ హక్కుల చర్యలో తోడ్పాటును నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఆపదలో ఉండే ఈ వ్యక్తికైనా ఎన్ హెచ్ ఆర్ సి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.