నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
హుజురాబాద్ ఏ.సీ.పి శ్రీనివాస్ జి
జమ్మికుంట :నేటి ధాత్రి
జమ్మికుంటలో ముందస్తుగా ఏసిపి శ్రీనివాస్ జి ఆధ్వర్యంలో స్థానిక సి ఐ వి. రవికుమార్ వీణవంక ఎస్సై తిరుపతి ఇల్లందకుంట ఎస్సై రాజకుమార్ ప్రొబేషనరీ ఎస్ఐ భార్గవ్ మరియు పోలీస్ సిబ్బంది స్థానిక గాంధీ చౌక్ బస్టాండ్ బేక్రిలు తదితర ప్రాంతాలలోని పాన్ షాపులను అనుమానాస్పద దుకాణాల్లో విస్తృతంగా తనిఖీ నిర్వహించారు వేడుకలను దృష్టిలో ఉంచుకొని చేపట్టినట్టు తెలిపారు అలాగే వేడుకల సందర్భంగా మారకద్రవ్యాలు గంజాయి విక్రయిస్తున్నారని అనుమానంతో తనిఖీలు చేశామని తెలిపారు డ్రగ్స్ మారకద్రవ్యాలు మత్తుపదార్థాలు వినియోగించిన సరఫరా చేసిన ప్రజలకు ఎవరైనా ఇబ్బంది కలిగేటట్టు ప్రవర్తించిన చట్ట రీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు వేడుకల సందర్భంగా బెల్ట్ షాపుల్లో సెట్టింగులు నిర్వహించవద్దని రోడ్లపై వేడుకలు నిర్వహించవద్దని తెలిపారు అలాగే నిబంధనలను ఉల్లంఘించి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగిన ప్రజలు గుర్తించి పోలీసులకు తెలియపరచాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!